కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయి: జిల్లా అదరపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

విద్యార్థులు చిన్నతనం నుండి కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయని జిల్లా అదనపు...Inspire news

Update: 2022-12-09 13:49 GMT

దిశ, వేమనపల్లి: విద్యార్థులు చిన్నతనం నుండి కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. ఆయన శుక్రవారం నాడు మండలంలోని నిల్వాయిలోని కస్తూర్బా బాలికల విద్యాలయం విద్యార్థులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో మాట్లాడుతూ కష్టపడి చదివి మంచి ఫలితాలు వస్తే జీవితంలో మంచి ఉద్యోగాలను పొందే అవకాశం ఉందని, చిన్నతనం నుండే చదువు పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు. మీకు మంచి ఆహారం వండి పెడుతున్నారా ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా చెప్పాలని విద్యార్థులతో మాట్లాడారు. ఆయన వెంట కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మయూరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

Similar News