నార్లపూర్ లో దారుణ హత్య

తన కుటుంబ సభ్యులను దూషించాడని ఓ వ్యక్తి దారుణ హత్య చేశాడు. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి నార్లాపూర్ లో శనివారం రాత్రి ముంజంపల్లి పోశం అలియాస్ బుజ్జి (50) దారుణ హత్యకు గురయ్యాడు.

Update: 2023-05-27 17:04 GMT

దిశ, మందమర్రి : తన కుటుంబ సభ్యులను దూషించాడని ఓ వ్యక్తి దారుణ హత్య చేశాడు. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి నార్లాపూర్ లో శనివారం రాత్రి ముంజంపల్లి పోశం అలియాస్ బుజ్జి (50) దారుణ హత్యకు గురయ్యాడు. ముంజంపల్లి సురేష్ అనే యువకుడు హత్య చేసినట్టు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ముంజంపల్లి సురేష్ కుటుంబ సభ్యులను మృతుడు దూషించడంతో హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మద్యం మత్తులో దూషించడంతో సురేష్ హత్య చేసినట్టు గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News