కొమురం భీం జిల్లాలో దారుణం.. చికిత్స కోసం వెళ్లిన గర్భిణీతో పాటు శిశువు మృతి
ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన గర్భిణీతో పాటు కడుపులో ఉన్న శిశువు సైతం ప్రాణాలు విడిచిన ఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది.
దిశ, ఆసిఫాబాద్: ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన గర్భిణీతో పాటు కడుపులో ఉన్న శిశువు సైతం ప్రాణాలు విడిచిన ఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాగజ్నగర్లోని ఓ ఆసుపత్రిలో ప్రసవం కోసం శ్వేత(27) అనే మహిళ చేరింది. ముందుగా గర్భంలో ఉన్న శిశువు చనిపోయిందని చెప్పిన వైద్యుడు సిజేరియన్ చేసి తీసేస్తామని తెలిపాడు. అనంతరం శ్వేత పరిస్థితి కూడా విషమించడంతో మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యుడు సూచించారు. దీంతో శ్వేతను ఆమె బంధువులు హుటాహుటిన తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు ఇద్దరి మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట మృతదేహంతో నిరసనకు దిగారు.