పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు

మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు పూనేం అడమయ్య అలియాస్ గణేష్ భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Update: 2024-03-02 12:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు పూనేం అడమయ్య అలియాస్ గణేష్ భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం పోలీసులు వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో గణేష్ కీలక దళ సభ్యుడిగా కొనసాగాడని పేర్కొన్నారు. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన అనేక ఎదురుకాల్పుల్లో పాల్గొన్నట్లు తెలిపారు. అయితే, లొంగిపోయిన గణేష్‌కు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రివార్డును అందజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News