తెలంగాణలో ఒక్కరోజే 1,802కేసులు

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24గంటల్లో 1,802 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,42,771కు చేరుకుంది. ఇందులో 31,635 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 1,10,241 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడచిన 24గంటల్లో 9 మంది మృతి చెందగా.. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం కరోనా మృతుల సంఖ్య 895కు […]

Update: 2020-09-06 23:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24గంటల్లో 1,802 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,42,771కు చేరుకుంది.

ఇందులో 31,635 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 1,10,241 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడచిన 24గంటల్లో 9 మంది మృతి చెందగా.. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం కరోనా మృతుల సంఖ్య 895కు చేరింది. కాగా, గడచిన 24 గంటల్లో 36,593 టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య 17,66,982కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

Tags:    

Similar News