కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నాం..

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. అంతేగాకుండా కరోనా లెక్కల్లో అవకతవలు ఉన్నాయనీ, ఇప్పటికే ప్రభుత్వానికి హైకోర్టు చురకలు అంటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. మార్చి 23తో పోలిస్తే కరోనా కేసులు దేశవ్యాప్తంగా 1,142 రెట్లు పెరగగా.. తెలంగాణలో 497 రెట్లు పెరిగాయని హైకోర్టుకు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు జూన్ 29న 3,457 […]

Update: 2020-07-29 12:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. అంతేగాకుండా కరోనా లెక్కల్లో అవకతవలు ఉన్నాయనీ, ఇప్పటికే ప్రభుత్వానికి హైకోర్టు చురకలు అంటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. మార్చి 23తో పోలిస్తే కరోనా కేసులు దేశవ్యాప్తంగా 1,142 రెట్లు పెరగగా.. తెలంగాణలో 497 రెట్లు పెరిగాయని హైకోర్టుకు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు జూన్ 29న 3,457 చేయగా. ఈనెల 25 నాటికి 15,654కి పెరిగాయని సర్కారు వివరించింది. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది.

పరీక్షల్లో కరోనా పాజిటివ్ శాతం 27.3 శాతం నుంచి 10.18శాతానికి తగ్గిందని వెల్లడించింది. మాస్కులు, భౌతిక దూరం పాటించని వారిపై, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారని నివేదికలో వివరించింది. రాష్ట్రంలో మాస్కులు ధరించని కారణంతో ఇప్పటివరకూ 35,308 కేసులు నమోదు కాగా, భౌతిక దూరం పాటించనందుకు 1211 కేసులు నమోదయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా అంత్యక్రియలు జరిపినందుకు హైదరాబాద్, రాచకొండ, రామగుండం, నిజమాబాద్, వికారాబాద్​లలో 6 కేసులు నమోదు కాగా, 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News