రూ.11 వేల ధరలో దేశీయ కొత్త స్మార్ట్ ఫోన్

దేశీయ కంపెనీ లావా బ్లేజ్ 5G స్మార్ట్‌ఫోన్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్‌.

Update: 2023-02-13 04:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ కంపెనీ లావా తన  బ్లేజ్ 5G స్మార్ట్‌ఫోన్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్‌. దీని అసలు ధర రూ. 11,999. కానీ లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.11,499 కే అందుబాటులో ఉంటుంది. లావా అధికారిక స్టోర్లు, ఈ కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 16 నుండి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు రానుంది. దీని బ్యాక్ సైడ్ గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ కలర్స్‌ను కలిగి ఉంటుంది.



లావా బ్లేజ్ 5G స్పెసిఫికేషన్స్

* 6.5-అంగుళాల HD+ IPS డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌.

* 7nm MediaTek డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

* స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్‌తో రన్ అవుతుంది.


* 6GB RAM, 128GB మెమరీని కలిగి ఉంది.

* బ్యాక్ సైడ్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది.

* ముందు సెల్పీల కోసం 8MP కెమెరాను అందించారు.

* 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

Tags:    

Similar News