అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. నల్ల చొక్కాలతో టీడీపీ నేతలు

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు నల్ల చొక్కాలతో శాసన సభ సమావేశాలకు హాజరయ్యారు. తొలుత వెంటకపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పూల మాలలతో నివాళులర్పించారు. అనంతరం నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పాదయాత్రగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి విధ్వంసం సాగిస్తున్నారని నినాదాలు చేశారు. సొంత అజెండా అమలు చేసేందుకే శాసనసభ సమావేశాలు కేవలం […]

Update: 2020-06-16 07:01 GMT

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు నల్ల చొక్కాలతో శాసన సభ సమావేశాలకు హాజరయ్యారు. తొలుత వెంటకపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పూల మాలలతో నివాళులర్పించారు.

అనంతరం నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పాదయాత్రగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి విధ్వంసం సాగిస్తున్నారని నినాదాలు చేశారు. సొంత అజెండా అమలు చేసేందుకే శాసనసభ సమావేశాలు కేవలం రెండు రోజులకు పరిమితం చేశారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

Tags:    

Similar News