సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం

దిశ, వెబ్‌డెస్క్: తాడేపల్లిలోని ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకోవాలంటూ కృష్ణా జిల్లా పెద్ద అవుటుపల్లికి చెందిన సురేశ్, సరస్వతి దంపతులు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ కరోనా ప్రభావం క్రమంలో పోలీసులు జగన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పెట్రోలో పోసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Update: 2021-05-19 04:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: తాడేపల్లిలోని ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకోవాలంటూ కృష్ణా జిల్లా పెద్ద అవుటుపల్లికి చెందిన సురేశ్, సరస్వతి దంపతులు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ కరోనా ప్రభావం క్రమంలో పోలీసులు జగన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు.

దీంతో పెట్రోలో పోసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News