నేడు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మీటింగ్

టీ20 వరల్డ్ కప్‌‌లో పాల్గొనే భారత జట్టు ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Update: 2024-04-29 16:36 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌‌లో పాల్గొనే భారత జట్టు ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. జట్టును ప్రకటించేందుకు మే 1 చివరి తేదీ. నేడో, రేపో జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం అహ్మదాబాద్‌లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సెలెక్షన్ కమిటీతో సమావేశం కానున్నాడు. ఈ మీటింగ్‌కు బీసీసీఐ సెక్రెటరీ జై షా కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. సమావేశం తర్వాత జట్టును ప్రకటించనున్నారు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో అగార్కర్ చర్చలు జరిపాడు. ఆదివారం కూడా వారితో సమావేశమయ్యాడు. దాదాపుగా జట్టు ఎంపిక ఖరారైనట్టే తెలుస్తోంది. నేడు జరిగే మీటింగ్‌లో వైస్ కెప్టెన్సీ, రెండో వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యాపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

Tags:    

Similar News