బోర్డర్-గవాస్కర్ సిరీస్లో టీమిండియా ఓపెనర్గా అతన్నే ఆడించాలి: హర్భజన్ సింగ్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫిబ్రవరి 9 నుంచి నాగ్పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
దిశ, వెబ్డెస్క్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫిబ్రవరి 9 నుంచి నాగ్పూర్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ పరిస్థితుల్లో ఓపెనింగ్ జోడీపై ఎవర్ని పంపాలని సమస్యగా మారింది. ముఖ్యంగా రోహిత్ శర్మకు జతగా ఓపెనర్ ఎవరా..? అనేది నిర్ణయించుకోలేకపోతుంది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను ఓపెనర్గా ఆడించాలా..? పరిమిత ఓవర్ల క్రికెట్లో వరుస సెంచరీలతో చెలరేగుతున్న శుభ్మన్ గిల్కు ఇవ్వాలా..? అనేది తేల్చుకోలేకపోతుంది. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ దీనిపై స్పందించాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ విజయం సాధించాలంటే రోహిత్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేయాలన్నాడు. ఫామ్లో ఉన్న ఆటగాడికే ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. శుభ్మన్ గిల్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. రాహుల్ కూడా మంచి ఓపెనరే.. కానీ ప్రస్తుతం అతను ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.