భారత మాజీ క్రికెటర్‌ కన్నుమూత

టీం ఇండియా క్రికెట్ మాజీ బ్యాట్స్‌మెన్ సుధీర్ నాయక్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం బాత్‌రూమ్‌లో జారి పడిపోవడంతో ఆయన తలకు గాయం అయింది. దీంతో అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు.

Update: 2023-04-06 02:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీం ఇండియా క్రికెట్ మాజీ బ్యాట్స్‌మెన్ సుధీర్ నాయక్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం బాత్‌రూమ్‌లో జారి పడిపోవడంతో ఆయన తలకు గాయం అయింది. దీంతో అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న సుధీర్ నాయక్(78) బుధవారం రాత్రి ముంబైలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా సుధీర్ నాయక్ కు భారత్ తరుఫున బ్యాట్స్‌మెన్ హోదాలో 3 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. ఆయన మృతి భారత క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News