టీ-20 వరల్డ్ కప్ జట్టులో చోటు.. సంజు శాంసన్ ఎమోషనల్ పోస్ట్

జూన్ 2వ తేదీ నుండి వెస్టిండీస్, అమెరికా వేదికగా ప్రారంభం కానున్న 2024 ఐసీసీ టీ 20 వరల్డ్ కప్‌కు టీమిండియా జట్టును ప్రకటించిన విషయం

Update: 2024-05-01 11:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 2వ తేదీ నుండి వెస్టిండీస్, అమెరికా వేదికగా ప్రారంభం కానున్న 2024 ఐసీసీ టీ 20 వరల్డ్ కప్‌కు టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన వరల్డ్ కప్ స్క్వాడ్‌ను మంగళవారం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ బ్యాటర్‌ రోహిత్ శర్మకు జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించగా.. ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. ఇక, ఈ జట్టులో యంగ్ బ్యాటర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌ చోటు దక్కించుకున్నాడు. ప్రతి ప్లేయర్‌కు చిరకాల వాంఛ అయిన వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కడంపై సంజు శాంసన్ రియాక్ట్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో శాంసన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

ఇటీవల విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కేరళ మూవీ ముంజుమ్మల్ బాయ్స్ మూవీలోని చెమట.. కష్టం కుట్టినా చొక్కా’ సాంగ్ లిరిక్స్‌ను ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్స్‌స్టా గ్రామ్‌లో స్టోరీగా పెట్టుకున్నాడు. ఇక, మాజీ పేసర్ శ్రీశాంత్ తర్వాత ఓ మలయాళ క్రికెటర్ టీమిండియా తరుఫున వరల్డ్ కప్ ఆడటం ఇదే ఫస్ట్ టైమ్. సంజు శాంసన్‌కు టీ20 వరల్డ్ కప్ స్వ్కాడ్‌లో చోటు దక్కడంపై అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంజు శాంసన్ ఇన్నాళ్ల కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దొరికిదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం రాజస్థాన్ కెప్టెన్‌గా శాంసన్ జట్టును విజయాల బాటలో నడిపిస్తున్నాడు. టోర్నీలో ఇప్పటికి 9 మ్యాచ్‌లో ఆర్ఆర్ ఎనిమిదింట్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ బెర్తు కన్ఫామ్ చేసుకుంది. 

Similar News