బాక్సింగ్లో భారత్ ఖాతాలో మరో నాలుగు పతకాలు ఖాయం
కజకిస్తాన్లో జరుగుతున్న ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మరో నాలుగు పతకాలు చేరాయి.
దిశ, స్పోర్ట్స్ : కజకిస్తాన్లో జరుగుతున్న ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మరో నాలుగు పతకాలు చేరాయి. పురుషుల విభాగంలో జాడుమణి సింగ్(51 కేజీలు), నిఖిల్(57 కేజీలు), అజయ్ కుమార్(63.5 కేజీలు), అంకుష్(71 కేజీలు) సెమీస్కు దూసుకెళ్లి పతకాలు ఖాయం చేసుకున్నారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో ఈ నలుగురు సత్తాచాటారు. జాడుమణి 5-0 తేడాతో ఫుంట్షో కిన్లీ(భూటాన్)ను చిత్తు చేయగా.. ఉజ్బెకిస్తాన్ బాక్సర్ భక్తియోరోవ్ ఆయుబ్ఖోన్పై 4-0 తేడాతో నిఖిల్ ఆధిపత్యం ప్రదర్శించారు. డామ్డిండోర్జ్ పీ(మంగోలియా)పై అజయ్, లీ జు సాంగ్(కొరియా)పై అంకుష్ విజయాలు నమోదు చేశారు. పురుషుల, మహిళల విభాగాల్లో కలుపుకుని మొత్తం 22 మంది భారత బాక్సర్లు శుక్రవారం సెమీస్ మ్యాచ్ల్లో పోటీపడనున్నారు.