మున్సిపల్ వైస్ చైర్మన్‌కు షోకజ్ నోటీస్

దిశ రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 111 జీఓకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు గురువారం కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ అడ్డుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నత అధికారులకు మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ కు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని […]

Update: 2020-09-24 13:47 GMT

దిశ రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 111 జీఓకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు గురువారం కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ అడ్డుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నత అధికారులకు మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ కు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Tags:    

Similar News