ఆ ఘటనపై నేడు సీఎంకు నివేదిక

దిశ, అమరావతి: విశాఖపట్నంలో జూన్ 7న ఏల్జిపాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నేడు సీఎం జగన్ కు నివేదిక సమర్పించనున్నది. ఘటనకు గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలో పొందు పరిచారు. ప్రజల నుండి పలు ఫిర్యాదులను ఈ కమిటీ తీసుకుంది. అటవీ పర్యావరణ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో పరిశ్రమ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, నగర కమిషనర్ […]

Update: 2020-07-05 23:51 GMT

దిశ, అమరావతి: విశాఖపట్నంలో జూన్ 7న ఏల్జిపాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నేడు సీఎం జగన్ కు నివేదిక సమర్పించనున్నది. ఘటనకు గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలో పొందు పరిచారు. ప్రజల నుండి పలు ఫిర్యాదులను ఈ కమిటీ తీసుకుంది. అటవీ పర్యావరణ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో పరిశ్రమ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, నగర కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ సభ్యులుగా ఉన్నారు.

Tags:    

Similar News