మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎస్ఈసీ నీలం సాహ్ని తెలిపారు. నవంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని షెడ్యూల్‌లో తెలిపారు. ఈనెల 6న నామినేషన్ల స్క్రూటినీ, నవంబర్ 8న నామినేషన్ల విత్ డ్రా..అదేరోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తామని నోటిఫికేషన్‌లో తెలిపారు. నవంబర్ 15న […]

Update: 2021-11-01 03:55 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎస్ఈసీ నీలం సాహ్ని తెలిపారు. నవంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని షెడ్యూల్‌లో తెలిపారు. ఈనెల 6న నామినేషన్ల స్క్రూటినీ, నవంబర్ 8న నామినేషన్ల విత్ డ్రా..అదేరోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తామని నోటిఫికేషన్‌లో తెలిపారు. నవంబర్ 15న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఇకపోతే పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపింది. ప్రతీ ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఎక్కడైనా పోలింగ్ ఇబ్బంది జరిగితే మరుసటి రోజు ఈనెల 16న రీ పోలింగ్.. 17న కౌంటింగ్ జరగనున్నట్లు ఎస్ఈసీ నీలం సాహ్ని ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News