దేశానికి పీవీ విశిష్ట సేవలు

దిశ, న్యూస్​బ్యూరో: బహుభాషాకోవిదునిగా, ప్రధానిగా పీవీ నరసింహారావు దేశానికి విశిష్ట సేవలు అందించారని జీహెచ్​ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం కమిషనర్​ మాట్లాడుతూ అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పీవీ దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడని అన్నారు. సాహితీవేత్తగా, రాజకీయ నాయకుడిగా బహుకోణాల్లో తన ప్రావీణ్యాన్ని నిరూపించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు విజయలక్ష్మి, […]

Update: 2020-06-28 09:16 GMT

దిశ, న్యూస్​బ్యూరో: బహుభాషాకోవిదునిగా, ప్రధానిగా పీవీ నరసింహారావు దేశానికి విశిష్ట సేవలు అందించారని జీహెచ్​ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం కమిషనర్​ మాట్లాడుతూ అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పీవీ దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడని అన్నారు. సాహితీవేత్తగా, రాజకీయ నాయకుడిగా బహుకోణాల్లో తన ప్రావీణ్యాన్ని నిరూపించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు విజయలక్ష్మి, జయరాజ్ కెన్నెడీ, ప్రియాంక అలా, బి. సంతోష్, కృష్ణ, యాదగిరి రావు, శంకరయ్య, సీపీఆర్​ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News