తానా సభల్లో కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు.. వీడియో రిలీజ్ చేసిన వైఎస్సార్సీపీ

అమెరికాలో జరుగుతోన్న తానా సభల్లో టీడీపీ ఎన్ఆర్ఐ తెలుగు తమ్ముళ్లు కొట్టుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఆరోపించింది.

Update: 2023-07-09 08:23 GMT

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో జరుగుతోన్న తానా సభల్లో టీడీపీ ఎన్ఆర్ఐ తెలుగు తమ్ముళ్లు కొట్టుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. టీడీపీ మీటింగ్ లో కొందరు తెలుగు తమ్ముళ్లు జై ఎన్టీఆర్ అంటూ నినాదం చేశారని, దీంతో ఆగ్రహించిన లోకేశ్ అభిమానులు వారిపై దాడికి దిగారంటూ పేర్కొంది.

ఈ క్రమంలోనే తరణి పరుచూరి, సతీష్ వేమన వర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు పరస్పర దాడులకు పాల్పడుతూ పిడిగుద్దులు గుద్దకున్నారని తెలిపింది. ఈ గొడవ టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే జరిగినట్లు వైఎస్సార్సీపీ కామెంట్ చేసింది. 

Tags:    

Similar News