రేపు ఈడీ విచారణకు మరోసారి ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈ రోజు రెండోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు.

Update: 2023-03-20 16:14 GMT

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈ రోజు రెండోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు పదిన్నర గంటలపాటు కొనసాగిన ఈడీ విచారణ.. రాత్రి తొమ్మిది గంటలకు ముగిసింది. ఇక రేపు మరోసారి ఈడీ విచారణకు కవిత హాజరు కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక రేపు ఈడీ విచారణకు కవిత హాజరు కానున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి :

ముగిసిన విచారణ.. నేరుగా కేసీఆర్ నివాసానికి MLC కవిత!  

నవ్వుతూ వెళ్లి.. నవ్వుతూ బయటకు వచ్చిన కవిత  

Tags:    

Similar News