లడాఖ్‌లో ప్రధాని మోడీ

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ లడాఖ్ లో పర్యటించారు. గత కొద్దిరోజుల నుంచి సరిహద్దు విషయమై భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోడీ లడాఖ్ లో ఆకస్మికంగా పర్యటించారు. ప్రధాని వెంట డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్, ఆర్మీ అధికారులు ఉన్నారు. అక్కడ ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రధానికి అధికారులు వివరించారు. సైనికులకు భరోసా ఇవ్వడంతోపాటు చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగానే ప్రధాని మోడీ పర్యటించినట్లు తెలుస్తోంది. ఇక ఇరు […]

Update: 2020-07-02 23:21 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ లడాఖ్ లో పర్యటించారు. గత కొద్దిరోజుల నుంచి సరిహద్దు విషయమై భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోడీ లడాఖ్ లో ఆకస్మికంగా పర్యటించారు. ప్రధాని వెంట డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్, ఆర్మీ అధికారులు ఉన్నారు. అక్కడ ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రధానికి అధికారులు వివరించారు. సైనికులకు భరోసా ఇవ్వడంతోపాటు చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగానే ప్రధాని మోడీ పర్యటించినట్లు తెలుస్తోంది. ఇక ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రధాని మోడీ లడాఖ్ లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Tags:    

Similar News