జగన్​ను సీఎం పదవి నుంచి తొలగించాలి.. సుప్రీంలో పిటిషన్ !

దిశ, ఏపీ బ్యూరో: జస్టిస్ ​ఎన్వీ రమణపై ఆరోపణలతో లేఖను విడుదల చేసిన వైఎస్ ​జగన్​ను సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది. సీఎం జగన్​పై సుమారు 30క్రిమినల్​ కేసులున్నాయని ఆరోపిస్తూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్​కుమార్ ​యాదవ్​‌లు పిటిషన్ వేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా సీఎం జగన్​పై మండిపడుతోంది. సీజేఐకి సీఎం జగన్‌ లేఖ రాయడాన్ని తప్పుబట్టింది. న్యాయవ్యవస్థను కించపరిచేలా జగన్‌ లేఖ […]

Update: 2020-10-14 10:58 GMT

దిశ, ఏపీ బ్యూరో: జస్టిస్ ​ఎన్వీ రమణపై ఆరోపణలతో లేఖను విడుదల చేసిన వైఎస్ ​జగన్​ను సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది. సీఎం జగన్​పై సుమారు 30క్రిమినల్​ కేసులున్నాయని ఆరోపిస్తూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్​కుమార్ ​యాదవ్​‌లు పిటిషన్ వేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా సీఎం జగన్​పై మండిపడుతోంది. సీజేఐకి సీఎం జగన్‌ లేఖ రాయడాన్ని తప్పుబట్టింది. న్యాయవ్యవస్థను కించపరిచేలా జగన్‌ లేఖ రాయడాన్ని ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ తెలిపింది.

Tags:    

Similar News