మీడియాకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆయన ఏది చేసిన ఎన్నికల వేళ కీలకంగా మారుతుంది.

Update: 2024-05-02 11:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆయన ఏది చేసిన ఎన్నికల వేళ కీలకంగా మారుతుంది. ఏ హామీ ఇచ్చిన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. విచిత్ర పనులకు, మాటలకు మీడియాకు ఎక్కుతాడు. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి పాల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు తన హామీలకు మీడియా కవరేజ్ ఇవ్వాలని.. అలా చేసిన వారందరికీ.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంచుతానని కేఏ పాల్ మీడియాకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేఏ పాల్‌కు ఎన్నికల సంఘం కుండ గుర్తును కేటాయింది. దీంతో ప్రజాశాంతి తరపున ప్రత్యేక మేనిఫెస్టోను పాల్ విడుదల చేశారు.

Similar News