అది అత్యంత విషాదం: పవన్

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనాకు చికిత్స తీసుకుంటున్న రోగులు అగ్నిప్రమాదానికి గురై మంటల్లో చిక్కి మృతిచెందడం అత్యంత విషాదం అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. అనంతరం […]

Update: 2020-08-09 02:13 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనాకు చికిత్స తీసుకుంటున్న రోగులు అగ్నిప్రమాదానికి గురై మంటల్లో చిక్కి మృతిచెందడం అత్యంత విషాదం అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News