‘ధర్మ పరిరక్షణ’ దీక్ష చేపట్టిన పవన్..!
దిశ, వెబ్డెస్క్: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు గల కారకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బీజేపీ, వీహెచ్పీ, జనసైనికులు పలుమార్లు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ప్రస్తుతం అక్కడ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా గురువారం నుంచి ధర్మ పరిరక్షణ పేరుతో దీక్షకు పిలుపునిచ్చాయి. కార్యకర్తలు ఎవరి ఇళ్ళల్లో వారు నల్ల బ్యాడ్జీలు, నల్ల […]
దిశ, వెబ్డెస్క్: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు గల కారకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బీజేపీ, వీహెచ్పీ, జనసైనికులు పలుమార్లు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ప్రస్తుతం అక్కడ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా గురువారం నుంచి ధర్మ పరిరక్షణ పేరుతో దీక్షకు పిలుపునిచ్చాయి. కార్యకర్తలు ఎవరి ఇళ్ళల్లో వారు నల్ల బ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలపాలని కోరాయి. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని తన ఇంట్లో ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు.
Read Also..