నేనే శివుడ్ని.. నాకు కరోనా టెస్టు ఏంటి ?: పద్మజ

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితురాలు పద్మజ క్షుద్రపూజల మత్తులో నుంచి ఇంకా బయటకు రాలేదు. మంగళవారం ఉదయం పురుషోత్తం, పద్మజను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కరోనా టెస్ట్ చేయించేందుకు తీసుకెళ్లారు. ఈ సమయంలో కరోనా టెస్ట్ చేయించుకోవాలన్న పోలీసులు, వైద్య సిబ్బందికి.. పద్మజ చుక్కలు చూపించింది. కరోనా వైరస్ చైనా నుంచి రాలేదని, శివుడి నుంచి వచ్చిందని చెప్పుకొచ్చింది. నేనే శివుడ్ని.. నాకు కరోనా టెస్ట్ ఏంటి అని […]

Update: 2021-01-26 02:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితురాలు పద్మజ క్షుద్రపూజల మత్తులో నుంచి ఇంకా బయటకు రాలేదు. మంగళవారం ఉదయం పురుషోత్తం, పద్మజను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కరోనా టెస్ట్ చేయించేందుకు తీసుకెళ్లారు. ఈ సమయంలో కరోనా టెస్ట్ చేయించుకోవాలన్న పోలీసులు, వైద్య సిబ్బందికి.. పద్మజ చుక్కలు చూపించింది. కరోనా వైరస్ చైనా నుంచి రాలేదని, శివుడి నుంచి వచ్చిందని చెప్పుకొచ్చింది. నేనే శివుడ్ని.. నాకు కరోనా టెస్ట్ ఏంటి అని మొడి కేసి కూర్చుంది. చెత్తను కడిగేయడానికే నా శరీరం నుంచి కరోనాను పంపించానని గట్టిగా అరుస్తూ చెప్పింది. పోలీసులు, వైద్య సిబ్బంది రిక్వెస్ట్ చేసి.. కరోనా టెస్ట్ చేయించారు. మతిస్థిమితం కోల్పోయిన పద్మజ, పురుష్తోతం రెండ్రోజుల క్రితం.. కూతుర్లు అలేఖ్య, దివ్యను హత్య చేయగా.. ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News