మార్చి 13 కోసం తారక్ ఫ్యాన్స్ వెయిటింగ్

దిశ వెబ్‌డెస్క్: సినిమాలతోనే కాదు.. హోస్ట్‌గా కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. గతంలో బిగ్‌బాస్-1కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తారక్ హోస్ట్‌గా చేయడంతో బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్ ఒక రేంజ్‌కి వెళ్లిపోయాయి. ఇక హోస్ట్‌గా కూడా ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. కంటెస్టెంట్లతో కామెడీ చేస్తూ తన రియల్ లైఫ్‌లో ఎలా ఉంటాడో అలాగే అందరిలో సరదాగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ […]

Update: 2021-03-09 20:43 GMT

దిశ వెబ్‌డెస్క్: సినిమాలతోనే కాదు.. హోస్ట్‌గా కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. గతంలో బిగ్‌బాస్-1కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తారక్ హోస్ట్‌గా చేయడంతో బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్ ఒక రేంజ్‌కి వెళ్లిపోయాయి. ఇక హోస్ట్‌గా కూడా ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. కంటెస్టెంట్లతో కామెడీ చేస్తూ తన రియల్ లైఫ్‌లో ఎలా ఉంటాడో అలాగే అందరిలో సరదాగా ఉన్నాడు.

అయితే ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ హోస్ట్‌గా మారనున్నాడు. జెమినీ టీవీలో ప్రసారం కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షోను ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నాడు. ఇటీవలే జెమినీ టీవీ ఒక ప్రొమోను విడుదల చేసింది. కానీ అందులో ఎన్టీఆర్ కనిపించలేదు. త్వరలో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షో మీ ముందుకు తీసుకొస్తున్నామని, బీ రెడీ అంటూ జెమినీ టీ ప్రొమో విడుదల చేసింది.

కానీ ఇందులో ఎన్టీఆర్ ఎక్కడా అంటూ తారక్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే మార్చి 13న ఎన్టీఆర్ హోస్టింగ్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కి సంబంధించిన ప్రొమోను విడుదల చేసే అవకాశముంది. దీంతో దీని కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షోను హోస్ట్ చేసేందుకు ఎన్టీఆర్ పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News