ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత.. విషాదంలో ఇండస్ట్రీ

దిశ, సినిమా : ప్రముఖ బాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ సాగర్ సర్హాది ఆదివారం అర్ధరాత్రి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు. దివంగత బాలీవుడ్ డైరెక్టర్ యశ్ చోప్రా తీసిన ‘కబీ కబీ, సిల్సిల, ఫాస్లె, చాందిని’ చిత్రాలకు డైలాగ్స్ అండ్ స్క్రీన్‌ప్లే‌ రైటర్‌గా గుర్తింపు పొందిన సాగర్.. ఈ క్రమంలో బసు భట్టాచార్య ‘అనుభవ్’, రాజ్ కన్వర్ ‘దీవానా’, రాకేశ్ రోషన్ ‘కహో నా […]

Update: 2021-03-22 01:31 GMT

దిశ, సినిమా : ప్రముఖ బాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ సాగర్ సర్హాది ఆదివారం అర్ధరాత్రి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు. దివంగత బాలీవుడ్ డైరెక్టర్ యశ్ చోప్రా తీసిన ‘కబీ కబీ, సిల్సిల, ఫాస్లె, చాందిని’ చిత్రాలకు డైలాగ్స్ అండ్ స్క్రీన్‌ప్లే‌ రైటర్‌గా గుర్తింపు పొందిన సాగర్.. ఈ క్రమంలో బసు భట్టాచార్య ‘అనుభవ్’, రాజ్ కన్వర్ ‘దీవానా’, రాకేశ్ రోషన్ ‘కహో నా ప్యార్ హై’ చిత్రాలకు కూడా డైలాగ్స్ రాశారు.

ఇక డైరెక్టర్‌గా ‘బజార్’ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. రియలిస్టిక్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే సాగర్ మృతి పట్ల సినీ అభిమానులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా వెర్సటైల్ యాక్టర్ నసీరుద్దిన్ షా, స్మితా పాటిల్, దీప్తి నావల్, మార్క్ జుబర్ వంటి భారీ తారాగణంతో ‘తేరే షహర్ మే’ అనే చిత్రాన్ని ప్లాన్ చేసిన సాగర్.. తన తొలి డైరెక్టోరియల్ సినిమా ‘బజార్’కు సీక్వెల్ కూడా తీయాలని ఇటీవలే అనుకున్నారట. కానీ అవేవీ కార్యరూపం దాల్చకుండానే ఆయన మరణించడం విచారకరం.

Tags:    

Similar News