నిమ్స్ కాంట్రాక్ట్ నర్సుల ధర్నా..

దిశ ప్రతినిధి, హైదరాబాద్: సవరించిన వేతనాలను వెంటనే తమకు వర్తింపజేయాలని నిమ్స్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేతనాలు పెంచాలని గత మూడేండ్ల నుంచి తాము వేతనాలు పెంచాలని కోరుతుండగా, ఈ నెలలో నిమ్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమై పెంచాలని నిర్ణయం తీసుకుందని, 20 శాతం ఇంక్రిమెంట్‌తో దానిని వెంటనే అమలు చేయాలన్నారు. అంతేకాకుండా తమకు మూడేండ్ల నుంచి ఇస్తున్న […]

Update: 2020-07-17 07:18 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: సవరించిన వేతనాలను వెంటనే తమకు వర్తింపజేయాలని నిమ్స్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేతనాలు పెంచాలని గత మూడేండ్ల నుంచి తాము వేతనాలు పెంచాలని కోరుతుండగా, ఈ నెలలో నిమ్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమై పెంచాలని నిర్ణయం తీసుకుందని, 20 శాతం ఇంక్రిమెంట్‌తో దానిని వెంటనే అమలు చేయాలన్నారు. అంతేకాకుండా తమకు మూడేండ్ల నుంచి ఇస్తున్న వేతనాలను స్టైఫండ్‌గా గుర్తిస్తున్నారని, దీనిని వేతనం కిందకు తేవాలని విజ్ఞప్తి చేశారు. తమకు ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, కోవిడ్ హాస్పిటల్ సిబ్బందికి ఇస్తున్న ఇన్సురెన్స్, డెయిలీ అలవెన్సులు కూడా వర్తింప జేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News