ఆర్మీ జవాన్లపై ఉగ్రమూకల దాడి.. ఐదుగురికి తీవ్ర గాయాలు
ఇటీవలే రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదుల దాడి జరిగి భారీగా అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: ఇటీవలే రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదుల దాడి జరిగి భారీగా అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. 60 మంది అక్కడికక్కడే మరణించగా.. 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా జమ్మూకాశ్మీర్ - పూంచ్ బార్డర్లో మరో దారుణం చోటుచేసుకుంది. సెక్టర్లో ఎయిర్ ఫోర్స్ వాహనాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాకుండా వాహనాల అద్దాలు డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.