సుప్రీంలో సెబీకి షాక్.. మరో 3 నెలల మాత్రమే టైమ్!

అదానీ గ్రూప్-హిండెన్ బర్గ్ రీసెర్చ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-05-12 14:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ గ్రూప్-హిండెన్ బర్గ్ రీసెర్చ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో వెలువడిన ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేయడానికి మరో ఆరు నెలల గడువు పొడిగించాలని సెబీ చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. మరో మూడు నెలల్లో దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఆగస్టు రెండో వారం తర్వాత తదుపరి విచారణ జరుపుతామని అప్పటి వరకు నివేదికను సమర్పించాలని తెలిపింది. చేసే పనిలో వేగం ఉండాలని సెబీ నిరవధికంగా సుదీర్ఘ సమయాన్ని తీసుకోకూడదని కోర్టు అభిప్రాయపడింది.

Tags:    

Similar News