రాజస్థాన్ మంత్రి ఆసక్తికర కామెంట్స్: పగలబడి నవ్విన ప్రజలు

రాజస్థాన్ మంత్రి బాబాలాల్ ఖరాడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, వారందరికీ ప్రధాని మోడీ ఇళ్లు నిర్మిస్తారని తెలిపారు.

Update: 2024-01-10 09:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ మంత్రి బాబాలాల్ ఖరాడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, వారందరికీ ప్రధాని మోడీ ఇళ్లు నిర్మిస్తారని తెలిపారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఖరాడీ ప్రసంగించారు. ‘ఎవరూ ఆకలితో నిద్రపోకూడదు, ఇల్లు లేకుండా జీవించ కూడదు’ అనేది ప్రధాని మోడీ కల. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు జన్మించినా సమ్యస్య ఏం ఉండదు. వారందరికీ మోడీ ఇల్లు కట్టిస్తాడు’ అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న సీఎం భజన్ లాల్ శర్మ, సమావేశానికి హాజరైన ప్రజలు పగలబడి నవ్వారు. అలాగే బీజేపీ నేతృత్వంలోని కేంద్రం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ప్రధాని మోడీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కాగా, ఖరాడీకి ఎనిమిది మంది పిల్లలు ఉండటం గమనార్హం. 

Tags:    

Similar News