మమ్మల్ని ఎవరూ ఆపలేరు: రాహుల్ గాంధీ

ప్రతిష్టాత్మక 'భారత్ జోడో యాత్ర'తో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే.

Update: 2022-10-03 02:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక 'భారత్ జోడో యాత్ర'తో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర కర్నాటకలోని మైసూర్ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాహుల్ గాంధీ ప్రసంగించారు. అయితే, రాహుల్ ట్విట్టర్ వేదికగా ఈ వీడియో పంచుకుంటూ ''భారతదేశాన్ని ఏకం చేయడం ద్వారా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. భారతదేశ స్వరాన్ని పెంచడం ద్వారా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మా ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు.'' అని క్యాప్షన్ రాసాడు.



Similar News