అయ్యప్ప స్వాములకు మహాద్భుత వీక్షణం.. నేడే మకర జ్యోతి దర్శనం

అకుంఠిత నియమ నిష్టలతో మండల దీక్ష పూర్తి చేసుకుని శబరిమల వెళ్లిన అయ్యప్పలకు ఇవాళ మహాద్భుతం అవిష్కృతం కాబోతోంది.

Update: 2024-01-15 05:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అకుంఠిత నియమ నిష్టలతో మండల దీక్ష పూర్తి చేసుకుని శబరిమల వెళ్లిన అయ్యప్పలకు ఇవాళ మహాద్భుతం అవిష్కృతం కాబోతోంది. నేడు మకర సంక్రాంతి కావడంతో శబరిమల కోనల్లో దైవ స్వరూపంలో ఉన్న మకర జ్యోతి అశేష అయ్యప్ప స్వాములు, దేశ ప్రజలకు దర్శనం ఇవ్వనుంది. నేడు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఉంటుంది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లను ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. ఇవాళ 50 వేల మంది భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి ఇచ్చామని ట్రావెన్ కోర్ బోర్డు తెలిపింది. 

Tags:    

Similar News