కర్ణాటకలోనూ 47,754 నమోదు... ఒక్క బెంగళూరులో 30,540

Update: 2022-01-20 16:55 GMT

బెంగళూరు: కర్ణాటకలోనూ గురువారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో 47,754 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక రాజధాని బెంగళూరులో 30,540 కేసులు వెలుగు చూసినట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో 29 మంది వైరస్‌తో మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 18.48శాతంగా నమోదైంది. రాష్ట్రంలో క్రియాశీలక కేసుల సంఖ్య 3 లక్షలు చేరువైంది.

Tags:    

Similar News