ఐఈడీ బ్లాస్ట్.. జవాన్‌కు గాయాలు

పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ పేలి ఓ జవానుకు గాయాలయ్యాయి.

Update: 2023-04-20 05:53 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ పేలి ఓ జవానుకు గాయాలయ్యాయి. ఈ సంఘటన బీజాపూర్ జిల్లా నెల్సనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం 7 గంటల సమయంలో పోలీసుల బృందం మావోయిస్టులను గాలిస్తూ బయల్దేరింది. గంట తరువాత బాంగాపాల్ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి చేరుకోగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ కనిపించింది. దీనిని నిర్వీర్యం చేస్తుండగా పేలిపోవటంతో సీతారాం కుడియం అనే జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని దంతేవాడ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు ఏసీపీ ఆంజనేయ వైష్ణయి తెలిపారు.

Tags:    

Similar News