పెట్రోలింగ్లో మిస్ఫైర్ అయిన గన్.. డీఆర్జీ కానిస్టేబుల్ మృతి
గన్ మిస్ఫైర్ అయిన ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా, మరోక పోలీసు గాయపడిన సంఘటన తాజాగా చోటు చేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో: గన్ మిస్ఫైర్ అయిన ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా, మరోక పోలీసు గాయపడిన సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా, రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన డీఆర్జీ, బస్తర్ ఫైటర్ల సంయుక్త బృందం పెట్రోలింగ్కు బయలుదేరుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) కానిస్టేబుల్ మృతి చెందగా, మరో పోలీసుకు బుల్లెట్ గాయాలయ్యాయి.
దంతేవాడ-నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని హందవాడ, హితవాడ గ్రామాల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా సిబ్బంది ఆపరేషన్ను ప్రారంభించిన సమయంలో అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా, గాయపడినటుంటి మరోకరిని చికిత్స కోసం విమానంలో రాయ్పూర్కు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.