ప్రాణం పోయినా దేశ విభజన జరగనివ్వను.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

కొందరు నాయకులు రాజకీయాల కోసం విద్వేషాలు రెచ్చగొడుతూ దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

Update: 2023-04-22 14:28 GMT

కోల్‌కతా : కొందరు నాయకులు రాజకీయాల కోసం విద్వేషాలు రెచ్చగొడుతూ దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రంజాన్ సందర్భంగా శనివారం కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్దమే. ఎట్టిపరిస్థితుల్లోనూ దేశాన్ని విభజించడానికి అనుమతించబోము. బెంగాల్‌లో అల్లర్లను కాదు శాంతిని కోరుకుంటున్నాం’ అని అన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని, రెచ్చగొట్టే ప్రసంగాలను నమ్మొద్దని కోరారు. ధైర్యం ఉంది కాబట్టే దర్యాప్తు సంస్థలతో పోరాడుతున్నామని తెలిపారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.  

Tags:    

Similar News