ఘోర రోడ్డు ప్రమాదం.. టూర్‌కు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు మృతి

టూర్‌కు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన ఉత్తరాఖండ్ లోని.. పానీ వాలా బ్యాండ్ సమీపంలో చోటు చేసుకుంది.

Update: 2024-05-04 06:07 GMT

దిశ, వెబ్ డెస్క్: టూర్‌కు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన ఉత్తరాఖండ్ లోని.. పానీ వాలా బ్యాండ్ సమీపంలో చోటు చేసుకుంది. డెహ్రాడూన్ IMS కాలేజీకి చెందిన నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలు టూర్‌కు వెళ్లారు. అక్కడ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో పానీ వాలా బ్యాండ్ సమీపంలో లోతైన గుంటలో కారు పడిపోయింది. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు మృతి చెందగా.. నాన్సీ అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయాలపాలైన యువతిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి విషమంగా ఉందని.. ఎస్పీ సిటీ ప్రమోద్ కుమార్ తెలిపారు.

Similar News