Breaking: కోరమండల్ ఎక్స్ ప్రెస్‌కు ఘోర ప్రమాదం... 100 మందికి పైగా తీవ్ర గాయాలు

ఒడిషాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఘోర ప్రమాదం జరిగింది...

Update: 2023-06-02 14:59 GMT

దిశ, వెబ్ డెస్క్: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఘోర ప్రమాదం జరిగింది. ఒడిశాలో  ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ప్రమాదం దాటికి 7 బోగీలు ఫల్టీలు కొట్టాయి. 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. 200 మందికి పైగా బోగీల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.  బాలాసోర్‌కు 40 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.


బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వే స్వేషన్‌లో ఆగివున్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. హౌరా నుంచి చెన్నై వెళ్తుండగా ఘటన జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికులు చెల్లాచెదురుగా పడ్డారు. ప్రాణభయంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.


క్షతగాత్రులను ఐదు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. గూడ్స్ రైలు ఉన్న ట్రాక్‌లోకి కోరమండల్ ఎక్స్ ప్రెస్ వెళ్లడంపై రైల్వే అధికారులు విచారిస్తున్నారు. 

Also Read:    Coromandel express accident : కోరమండల్ రైలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?

Tags:    

Similar News