బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదు: రాజ్‌నాథ్ సింగ్

కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఆర్జేడీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మైనారిటీ వర్గాలను కోరారు.

Update: 2024-05-02 14:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక ఇస్లామిక్ దేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక గౌరవం లభిస్తోందని, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. గురువారం బీహార్‌లోని సుపాల్, సరన్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా మాట్లాడిన ఆయన, బీజేపీ హిందూ-ముస్లిం విభజనను సృష్టిస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. 'కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఆర్జేడీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మైనారిటీ వర్గాలను కోరారు. ప్రతిపక్ష పార్టీలు మీ ముఖంపై ఇసుక జల్లి ఓట్లను పొందాలని వారు భావిస్తున్నారు. అరబ్ ప్రపంచంలోని కనీసం ఐదు ఇస్లామిక్ దేశాల్లో ప్రధాని మోడీకి అత్యున్నత గౌరవం లభించింది. అయినా ప్రతిపక్షాలు తమపై అభియోగాలు మోపుతున్నాయని ' అన్నారు. రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు సాధ్యం కాదని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. వాస్తవానికి వెనుకబడిన తరగతుల కోటాల కోసం ఉన్న నిబంధనే ముస్లిం జానాభాల్లో వెనుకబడిన వర్గాల వారు అదే పరిధిలోకి వస్తారన్నారు. 400కి పైగా లోక్‌సభ స్థానాలను సాధించాలనే లక్ష్యంతో ఎన్డీఏ ముందుకెళ్తోందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News