జీతాల నుంచి కొంత అమౌంట్ ను వారికి ఇవ్వండి.. ఎంపీలకు వరుణ్ గాంధీ రిక్వెస్ట్

ఒడిశా రైలు ప్రమాదం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 278మంది చనిపోగా.. 1000 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2023-06-03 12:16 GMT

దిశ, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 278మంది చనిపోగా.. 1000 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బాలాసోర్ రైలు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలవాలని ఎంపీలను ఆయన కోరారు. ఇందుకోసం తమ జీతాల నుంచి కొంత అమౌంట్ ను బాధిత కుటుంబాలకు అందజేయాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రిక్వెస్ట్ చేశారు. 

Tags:    

Similar News