ఆప్ అభ్యర్థుల తరఫున సునితా కేజ్రీవాల్ రోడ్ షో..!
ఢిల్లీ సీఎం సింహం అని.. ఆయన్ని ఎవరూ నాశనం చేయలేరని అన్నారు ఆయన భార్య సునితా కేజ్రీవాల్. ఆప్ తూర్పు ఢిల్లీ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం సింహం అని.. ఆయన్ని ఎవరూ నాశనం చేయలేరని అన్నారు ఆయన భార్య సునితా కేజ్రీవాల్. ఆప్ తూర్పు ఢిల్లీ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. కొండ్లీ ప్రాంతంలో సునితా వాహనం సన్ రూఫ్ లో నిలబడి చేతులు జోడించి ప్రజలకు అభివాదం చేశారు.
పాఠశాలలు కట్టడం, ఉచిత విద్యుత్ అందించడం, మొహల్లా క్లినిక్లు ప్రారంభించడం వల్లే ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు పాలయ్యారని ఆమె అన్నారు. నియంతృత్వాన్ని తొలగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటేయాలని పేర్కొన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారానికి సునీతా కేజ్రీవాల్ నాయకత్వం వహించారు. ఆదివారం పశ్చిమ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గంతో సహా దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ నియోజకవర్గాలతో పాటు గుజరాత్, హర్యానా, పంజాబ్లలో కూడా సునీతా కేజ్రీవాల్ ఆప్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు.
#WATCH | Delhi | Sunita Kejriwal, wife of CM Arvind Kejriwal, holds a roadshow in Kondli area in support of AAP's East Delhi candidate Kuldeep Kumar.#LokSabhaElections2024 pic.twitter.com/zdzeTZwSgE
— ANI (@ANI) April 27, 2024