విమానంలో భారీ కుదుపు.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు

ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది.

Update: 2023-05-17 13:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. బీ787-800 విమానం ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్తుండగా ఆకాశంలోనే భారీ కుదుపులకు లోనైంది. ఒక్కసారిగా విమానం ఒడిదుడుకులకు గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ఏం జరుగుతోందో అని భయంతో వణికిపోయారు. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడు, నర్సు, సిబ్బంది గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. విమానం సిడ్నీ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని వైద్యలు తెలిపారు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది.

Tags:    

Similar News