రైళ్లపై దాడి చేస్తే ఇక అంతే.. కీలక ఆదేశాలు జారీ చేసిన రైల్వే శాఖ

ఈ మధ్యకాలంలో రైళ్లపై దాడులు ఎక్కువగా జరుగున్నాయి.

Update: 2023-03-29 07:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో రైళ్లపై దాడులు ఎక్కువగా జరుగున్నాయి. ఇటీవల వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లపై రాళ్ల దాడులు జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లపై రాళ్లు విసరడం, ధ్వంసం చేయడం వంటివి చేస్తే అయిదేళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. అయితే భువనగిరి, కాజీపేట, ఖమ్మం, ఏలూరు, రాజమండ్రిలో జనవరి నుంచి ఇప్పటివరకు రైళ్లపై దాడి చేసిన 39 మందిని ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి: బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్

Tags:    

Similar News