అందుకే జడేజాకు అవకాశం ఇచ్చా : ధోనీ

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో శనివారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ స్పిన్ బౌలర్ రవీంద్ర జడేజాతో వేయించడంపై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘బ్రావో బౌలింగ్ చేయాల్సి ఉండగా… తాను ఫిట్‌గా లేనని చెప్పి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు. జడేజా, కరణ్ శర్మకు మాత్రమే మరో చెరో ఓవర్ మిగిలి […]

Update: 2020-10-18 01:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో శనివారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ స్పిన్ బౌలర్ రవీంద్ర జడేజాతో వేయించడంపై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘బ్రావో బౌలింగ్ చేయాల్సి ఉండగా… తాను ఫిట్‌గా లేనని చెప్పి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు. జడేజా, కరణ్ శర్మకు మాత్రమే మరో చెరో ఓవర్ మిగిలి ఉంది. దీంతో రిస్క్ అని తెలిసినా జడేజాకు అవకాశం ఇచ్చాను.’ అని ధోని వెల్లడించారు.

Tags:    

Similar News