‘అవినీతి రహిత రాష్ట్రంగా ఏపీ అభివృద్ధి’

దిశ, విశాఖపట్నం: అవినీతి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖ జిల్లా యలమంచిలిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ మహిళలకు చేస్తున్న కార్యక్రమాలు అనిర్వచనీయమని, ఇలాంటి సీఎం మరో 25 సంవత్సరాలు ఉండాలని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలన్నారు. సీఎం మహిళా పక్షపాతిగా నిరూపించుకుంటూ వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడుతున్నారన్నారు. ఇళ్ల పట్టాల […]

Update: 2021-01-08 07:11 GMT

దిశ, విశాఖపట్నం: అవినీతి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖ జిల్లా యలమంచిలిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ మహిళలకు చేస్తున్న కార్యక్రమాలు అనిర్వచనీయమని, ఇలాంటి సీఎం మరో 25 సంవత్సరాలు ఉండాలని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలన్నారు. సీఎం మహిళా పక్షపాతిగా నిరూపించుకుంటూ వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడుతున్నారన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని భారతదేశంలో అతిపెద్ద కార్యక్రమంగా నిలిపినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News