వరదను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

దిశ, భువనగిరి: కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ జనజీవనం అస్తవ్యస్తమైంది. చేతికొచ్చిన పంట నీట మునిగిందని రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుతూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి బుధవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనిపై ప్రధాని మోదీ తక్షణమే స్పందించి రాష్ట్రంలో వర్షబీభత్సంపై ఏరియల్ సర్వే నిర్వహించాలని కోరారు. జాతీయ విపత్తుగా ప్రకటించి తెలంగాణకు తక్షణ సాయం కింద రూ. 2వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరదలపై సీఎం కేసీఆర్ […]

Update: 2020-10-14 03:17 GMT

దిశ, భువనగిరి: కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ జనజీవనం అస్తవ్యస్తమైంది. చేతికొచ్చిన పంట నీట మునిగిందని రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుతూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి బుధవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనిపై ప్రధాని మోదీ తక్షణమే స్పందించి రాష్ట్రంలో వర్షబీభత్సంపై ఏరియల్ సర్వే నిర్వహించాలని కోరారు. జాతీయ విపత్తుగా ప్రకటించి తెలంగాణకు తక్షణ సాయం కింద రూ. 2వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో వరదలపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఓట్ల రాజకీయాలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. ఈ విషయంలో తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని వరద బాధితులను ఆదుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News