నరేంద్ర మోడీ చేతకాని దద్దమ్మ.. భార్యనే ఏలుకోలేదు.. అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు

మోడీ చేతగాని దద్దమ్మ అని, ప్రధాని, అంబానీ, అదానీలు కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు.

Update: 2024-05-05 10:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మోడీ చేతగాని దద్దమ్మ అని, ప్రధాని, అంబానీ, అదానీలు కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ లో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసిన బారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఏక్ నిరంజన్ అని, ఆయన భార్యను కూడా ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలుతాడో ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయుడ్ని భద్రాద్రి రామలయంలో పెట్టుకున్నామని, కానీ మోడీ మాత్రం ఏడ్చే రాముడు, బాల రాముడు అని చెప్పి అయోద్యలో పెట్టాడని మండిపడ్డాడు.

అంతేగాక పక్కనే బాబ్రీ మసీదు కట్టుకుంటుంటే.. ముస్లింల మీద విషం చిమ్ముతున్నారని, పాకిస్థాన్ పొమ్మంటే నా దేశం పాకిస్థాన్ కాదు. నేను ఈ దేశంలోనే పుట్టిన, ఈ దేశవాసిని అన్న ముస్లింలపై అక్కసు వెల్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ అనేవాడు చేతగాని దద్దమ్మ అని అమిత్ షా అనే లఫుట్ గాడ్ని పక్కన పెట్టుకొని ఈ దేశాన్ని దోచుకుంటున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని, అంబానీ, అదానీ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని, తినే ఉప్పు మీద, పప్పు మీద, చపాతీ మీద, పెరుగు మీద పన్ను వేసి 120 కోట్ల మంది హిందువులను దోచుకుంటున్నారని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కుట్లలు చేసిన రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని అన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, రేపు దేశంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే మన ప్రథమ కర్తవ్యం అని అద్దంకి దయాకర్ నిర్ధేశించారు.

Similar News