ఆ సంబంధాలపై క్లారిటీ ఇచ్చిన Samantha..

హీరోయిన్ సమంత అనారోగ్య కారణాల వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

Update: 2023-08-24 15:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ సమంత అనారోగ్య కారణాల వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం సామ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘ఖుషి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ హీరోయిన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కడ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. దానికి మానవ సంబంధాలపై క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘‘ఈ భూమి మీద ఉన్న జీవులన్నింటికీ సంబంధం ఉంది. మన చేతులు గబ్బిలం రెక్కల్లా లాగా ఉంటాయి. మన కణాలు పైనాపిల్ కణాల్లా ఉంటాయి. మన డీఎన్‌ఏకు పుట్టగొడుగులతో సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ మరోకరితో సంబంధం ఉంటుంది. కాకపోతే కొంచెం దగ్గరగా లేదా దూరం అంతే. అందరం ఒకే కణం నుంచి వచ్చినవాళ్లమే.’’ అని టాలీవుడ్ స్టార్ సమంత కాస్త ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సామ్ చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి : ‘Khushi’ నాకు ఓ మధురమైన జ్ఞాపకం : Vijay Devarakonda

Full View

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News